ఇంటింటికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సందేశం" ప్రారంభించిన బిజెపి
భూదాన్ పోచంపల్లి జూన్ 11
ఇంటింటికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సందేశం" కార్యక్రమాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి దనుంజయ్య ప్రారంభించారు. గురువారం నాడు పోచంపల్లి మండల కేంద్రంలోని జలాల్పురం గ్రామంలో మోదీ గారు ఈ సంవత్సర కాలంలో బిజెపి సాధించిన విజయాలను ఇంటింటికి తిరుగుతూ నరేంద్రమోదీ గారి సందేశాన్ని ప్రజలకు వివరించారు. భారత ప్రధాని మోడీ సంక్షేమ పథకాలు ప్రజల కోసం అమలు చేస్తున్న విధానాన్ని ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి. పథకాలు అమలు గురించి ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ,బిజెపి పోచంపల్లి మండల అధ్యక్షులు చింతల రామకృష్ణ జిల్లా నాయకులు నోముల గణేష్ ప్రధాన కార్యదర్శిలు కొంతం శంకర్ గౌడ్ కేసారం కృష్ణారెడ్డి మేకల చొక్కారెడ్డి చింతల ఉపేందర్ ఎర్ర లక్ష్మణ నల్ల నర్సింగరావు బోయిని లింగం యాదవ్ శ్రీకాంత్ నాయక్ నరేందర్ దోర్నాల చంద్రయ్య ఉపేందర్ శ్రీకాంత్ మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.