YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ప్రియుడిని చెట్టుకు కట్టేసి…

ప్రియుడిని చెట్టుకు కట్టేసి…

ప్రియుడిని చెట్టుకు కట్టేసి…
ఏలూరు జూన్ 11
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురంకి చెందిన ప్రేమజంట వ్యవహారం జిల్లాలో కలకలం రేపింది. వేము రాజు, లావణ్యాలు ఇద్దరు గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.ఈ క్రమంలో లావణ్య ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వీళ్ల పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు కలసి జీవించాలని నిర్ణయించుకొని పాలకొల్లు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పెళ్లి  చేసుకునేందుకు ప్రయత్నించుకున్నారు. అయితే లావణ్య సోదరుడుకి విషయం తెలియడంతో పాలకొల్లు మండలం దిగమర్రు లో వారు వస్తున్న కారును అడ్డగించి ప్రేమికుడైన వేము రాజును బంధువులతో కలిసి కరెంటు స్తంభానికి కట్టి గాయపరచాడు. దీంతో ప్రేమికులు  పోలీసులకు ఫిర్యాదు చేసారు. పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఎస్ ఐ అప్పారావు దర్యాప్తు చేస్తున్నారు

Related Posts