శబరిమలలో దర్శనాలు లేవు
తిరువనంతపురం జూన్ 11
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా శబరిమలలో భక్తులను అనుమతి లేదని తాజాగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా భక్తులను శబరిమలకు అనుమతించమని మంత్రి సురేంద్రన్ ప్రకటించారు. శబరిమల దేవాలయ ప్రధానార్చకులు, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సభ్యులతో మంత్రి సమావేశం అయ్యారు. అనంతరం ఆలయంలో జరిపే నెలవారీ పూజలతోపాటు ఆలయ ఉత్సవాలను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆలయంలో సాధారణంగా జరిగే పూజలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు.