మేరి అవాజ్' పోస్టర్లు ఆవిష్కరణ...
ఎన్ ఎస్ యు ఐ
ఎమ్మిగనూరు జూన్ 11
పట్టణంలో ఎన్ ఎస్ యు ఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు "కరోనా మహమ్మారి తరువాత ప్రపంచం" అనే విషయం పైన విద్యార్థులరా, యువకులరా మీ అభిప్రాయం మా తో పంచుకోండి మీలో ఉన్న నాయకలక్షనన్ని ప్రోత్సహించండి భావితరాలకు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుతూ గురువారం ఎమ్మిగనూరు స్థానిక ఎన్ ఎస్ యు ఐ కార్యాలయంలో పోస్టర్లు విడుదల చేశారు. ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వీరేశ్ యాదవ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచం సవాళ్ళు, అవకాశాలు అనే అంశంపై పై మేరీ ఆవాజ్ అనే చర్చను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు రెండు లేదా మూడు నిమిషాల పాటు వీడియో తో మాట్లాడి 7983447784 వాట్సాప్ నంబర్ కు పంపాలని తెలిపారు. నాయకత్వ లక్షణాలు ప్రోత్సహించేందుకు ఎన్ఎస్యుఐ తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు ఈరన్న, నరసింహులు,వృకుంను,విజయ్ పాల్గొన్నారు