YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

 గాంధీ ఆస్పత్రిలో బాడీ మిస్సింగ్

 గాంధీ ఆస్పత్రిలో బాడీ మిస్సింగ్

 గాంధీ ఆస్పత్రిలో బాడీ మిస్సింగ్
హైద్రాబాద్, జూన్ 11
 గాంధీ హాస్పిటల్‌లో కరోనా పేషెంట్ చనిపోగా.. డెడ్ బాడీ కనిపించకుండా పోవడం ఆందోళనకు దారి తీసింది. మెహదీపట్నానికి చెందిన రషీద్ ఖాన్ (37) జూన్ 9న కరోనాతో గాంధీ హాస్పిటల్‌లో చేరాడు. మరుసటి రోజు తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతదేహాన్ని మార్చురికీ తరలించి.. రషీద్ చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తీరా వారు వచ్చి చూడగా డెడ్ బాడీ కనిపించలేదు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.డెడ్ బాడీ మాయమైన విషయమై హాస్పిటల్ వర్గాలు స్పందించలేదని సమాచారం. మృతదేహం ఎలా మిస్సయ్యిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. గాంధీ హాస్పిటల్‌లో ఒకరి మృతదేహానికి బదులు మరొకరు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్మశాన వాటికకు తీసుకెళ్లిన తర్వాత మృతదేహాన్ని చూసిన బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు, వైద్య సిబ్బంది వెంటనే మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో మృతుల బంధువులు జూనియర్ డాక్టర్లపై దాడికి దిగారు. డెడ్ బాడీ మరొకరికి ఇచ్చేసిన సిబ్బంది గాంధీ హాస్పిటల్‌లో కరోనా పేషెంట్ డెడ్ బాడీ మిస్సింగ్ ఘటనపై క్లారిటీ వచ్చింది. మెహదీపట్నానికి చెందిన రషీద్ కోవిడ్ బారిన పడటంతో జూన్ 9న హాస్పిటల్లో చేరగా.. బుధవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించగా.. బంధువులు వచ్చే సరికి కనిపించలేదు. దీంతో బంధువులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు డెడ్ బాడీ ఎలా మిస్సయిందనే విషయమై ఆరా తీశారు.రషీద్ మృతదేహాన్ని పొరబాటున వేరే వాళ్లకు ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో వాళ్లు బుధవారమే అంత్యక్రియలు నిర్వహించారని తేలింది. రషీద్ మృతదేహం కోసం వెతుకుతున్న ఆయన సోదరుడికి గాంధీ హాస్పిటల్ వర్గాలు ఈ సమాచారం అందించారు. పూర్తి వివరాలకు అతణ్ని సంప్రదించొచ్చని తెలిపారు.గాంధీలో కరోనా పేషెంట్ డెడ్ బాడీ మిస్ కావడం ఇదే తొలిసారి కాదు. ఇటీవలే ఒకరి మృతదేహం బదులు మరొకరి డెడ్ బాడీని అప్పగించడంతో.. అంత్యక్రియలు చేసే ముందు గమనించిన బంధువులు గాంధీ హాస్పిటల్ వర్గాలకు సమాచారం అందించాయి. జూనియర్ డాక్టర్లపై కొందరు దాడికి తెగబడ్డారు. తీవ్రమైన పని ఒత్తిడి, సమాచార లోపం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి.అంతకుముందు హయత్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి గాంధీ హాస్పిటల్‌లో కరోనాతో చనిపోగా.. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కుటుంబీకులకు సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ విషయమై మృతుడి భార్య హైకోర్టును ఆశ్రయించారు

Related Posts