YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వధువు తల్లికి కరోనా

వధువు తల్లికి కరోనా

వధువు తల్లికి కరోనా
బెంగళూర్, జూన్ 11
మనిషి జీవితాన్ని కరోనా మహమ్మారి తలకిందులు చేస్తోంది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఓ ఇంట్లో అలజడి రేపింది. ఓ తండ్రి తన కుమార్తెకు నిరాడంబరంగా పెళ్లి జరిపిద్దామని భావించగా.. చివరి నిమిషంలో అడ్డుపడింది. వివాహ ముహుర్తానికి కొన్ని గంటల ముందు వధువు తండ్రికి, చెల్లెలికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వివాహం వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కర్ణాటకలోని బళ్లారి జిల్లా యాదగిరి తాలూకా అల్లిపుర తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది.అల్లిపుర తండాకు చెందిన ఓ యువతికి, కలబుర్గి జిల్లా చిత్తాపుర తాలూకా నాల్వార తండాకు చెందిన యువకుడితో గురువారం (జూన్ 11) పెళ్లి జరిపించడానికి ముహూర్తం నిశ్చయించారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే.. పెళ్లికూతురు తండ్రికి, చెల్లికి కరోనా పాజిటివ్‌ రావడంతో అంతా తారుమారైంది.పెళ్లికూతురు కుటుంబం ఏపీలోని నెల్లూరులో నివాసం ఉంటోంది. పెళ్లి నిమిత్తం 10 రోజుల కిందట బళ్లారి జిల్లాకు వచ్చింది. అంతర్రాష్ట్ర ప్రయాణం కావడంతో అధికారులు వారికి కరోనా పరీక్షలు చేశారు. ఏడు రోజులు పాటు క్వారంటైన్‌లో ఉంచి ఇంటికి పంపించారు. తాజాగా చేసిన పరీక్షల్లో తండ్రి, చెల్లికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో పెళ్లి వాయిదా వేశారు.వీరితో పాటు అల్లీపుర తండాలో మొత్తం 11 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా బాధితుల కుటుంబసభ్యులను, వారిని కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి వైద్య సిబ్బంది వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు

Related Posts