YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా

 బాలయ్య వర్సెస్ నాగబాబు

 బాలయ్య వర్సెస్ నాగబాబు

 బాలయ్య వర్సెస్ నాగబాబు
హైద్రాబాద్, జూన్ 11,
తాజా పరిస్థితులు చూస్తుంటే నందమూరి బాలకృష్ణ- నాగబాబు మధ్య వార్ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. సీఎం కేసీఆర్‌ని టాలీవుడ్ పెద్దలు కలవడంపై 'భూములు పంచుకునేందుకు వెళ్ళారా?' అని బాలయ్య కామెంట్ చేయడం.. దానికి కౌంటర్‌గా నాగబాబు ఘాటు రియాక్షన్ ఇవ్వడంతో మొదలైన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. నిజానికి ఈ ఇష్యూ ముగిసిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పిన నాగబాబు.. తాజాగా మరోసారి బాలయ్యను కెలికారు. ఆయనపై పరోక్షంగా జబర్దస్త్ పంచులు విసిరారు. దీంతో ఈ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ అయింది.ఇటీవలే తన బర్త్ డే సందర్భంగా బాలకృష్ణ 'శివ శంకరి' పాట పాడిన విషయం తెలిసిందే. తండ్రి ఎన్టీఆర్ నటించిన అలనాటి చిత్రం 'జగదేకవీరుని కథ' సినిమాలోని 'శివశంకరీ' పాటను ఆలపించి అభిమానులకు సడెన్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఒకరోజు ముందే ఈ పాటను ఎన్‌బీకే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ చేశారు బాలకృష్ణ. నిమిషాల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది.అయితే ఈ పాటను చూసిన నెటిజన్స్ మిశ్రమంగా స్పందించారు. కొందరు బాలయ్య ప్రయోగాన్ని మెచ్చుకుంటే మరికొందరు ఆయన పాడిన తీరుపై విరుచుకుపడ్డారు. ఘంటసాల ఎంతో అద్భుతంగా ఆలపించిన ఆ క్లాసికల్ సాంగ్‌ని బాలకృష్ణ కూనీ చేశారని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే మరోసారి బాలయ్యను కెలికేలా నాగబాబు ట్వీట్స్ చేయడం సోషల్ మీడియాలో రచ్చకు కారణమైంది.''కరోనా జబ్బు కన్నా ప్రమాదకరమైన సంగీతం సర్క్యూలేట్ అవుతుందిరా.. అయ్యా జాగ్రత్తరా అయ్యా.. దండం పెడతాను. అయ్యబాబోయ్ చిన్న పిల్లలని, ముసలి వాళ్లను, హెల్త్ బాగాలేని వాళ్లని, సంగీతం వినకుండా చూసుకోండి. విన్నారంటే ఏదైనా జరగొచ్చు.. అయినా ఏందయ్యా ఇది.. ఇది నేను చూల్లే.. ఎక్కడ ఇనలే'' అని ట్వీట్ చేసి డిలీట్ చేసిన నాగబాబు.. ఆ తర్వాత ''ఒక్కోసారి ఓల్డ్ సాంగ్స్ రీమిక్స్ కన్నా ఒరిజినల్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ తరానికి ఘంటసాల గాత్ర మాధుర్యం విలువ ఈ పాటికె తెలిసుంటది'' అని పేర్కొంటూ మరో ట్వీట్ చేశారు.మెగాబ్రదర్ నాగబాబు చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపాయి. మెగా, నందమూరి అభిమానుల నడుమ వార్ ముదిరేలా చేశాయి. దీంతో ఒకరిపై మరొకరు విరుచుకుపడుతూ ఇరు వర్గాల ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. 'బాలకృష్ణకు తాను ఎస్పీ బాలు కాదు అని తెలియదా?' అని మెగా వర్గం అంటే.. ''తెలుసు కాబట్టే పాటలు పాడేయలేదు. తన పాత్రకు తగ్గట్టుగా ఓ పాటను 'పైసా వసూల్' సినిమాలో దర్శకుడు పూరీ జగన్నాధ్ పాడించాడు. అది అక్కడ బాగానే పండింది. నాన్న అభినయానికి తన్మయత్వం చెందుతూ.. అక్కడ వచ్చే పాటను ప్రయత్నించాడు. సిగ్గుపడకుండా రికార్డు చేయించి.. తన పుట్టినరోజున యూట్యూబ్ లో తన అభిమానులకోసం వదిలాడు. ఏ ప్రొడ్యూసర్ మీదనో ఆ సింక్ కాని ప్రయత్నాన్ని రుద్ది.. వారికి నష్టం చెయ్యలేదు'' అని నందమూరి ఫ్యాన్స్ కౌంటర్స్ వేస్తున్నారు.ఇక నాగబాబు ట్వీట్ చూసి కోపంతో రగిలిపోతున్న నందమూరి ఫ్యాన్స్.. మెగా వర్గాన్ని గట్టిగానే టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలను సైతం ఈ ఇష్యూ లోకి లాగేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు. ''నిజమే జనసేన  కన్నా ప్రజారాజ్యం ఒరిజినల్బెటర్ అని అనిపించింది'' అని పంచులు విసురుతున్నారు. అంతేకాదు ''మృగా రాజు సినిమాలో.....నీ అన్న పాడిన పాటకన్నా.....1000 రేట్లు బెటర్ గా పాడాడు బాలయ్య....... సో...... ముసుకో.......'' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ''మీరు మారరు నాగబాబు గారు సినీ రంగంలో మీకు ఉన్న అర్హత ఏంటి తెలుసా: ఒక నటన రాదు,ప్రొడ్యూసర్ గా కూడా పనికి రాలేదు మీకు ఉన్నది ఒక్క జబర్దస్త్ అక్కడ కూడా మొహమాటం లేకుండా మెడ పట్టుకు బయటకు తోసేసారు అని బయట ప్రజలు అంటున్నారు.నేను ఎందుకు పనికి రాను అనే బాధలో ఇటువంటి పోస్టులు పెడుతున్నారు'' అంటూ మరో నెటిజన్ షాకింగ్ కామెంట్ చేశాడు.
 

Related Posts