అచ్చెన్న అరెస్టు కక్ష సాధింపు చర్య
రావులపాలెం జూన్ 12,
మాజీ మంత్రి కింజరపు అచ్చెన్న నాయుడును ఈఎస్ ఐ స్కాం పేరిట ఏసీబీ అధికారులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో పార్టీ కార్యాలయం వద్ద పార్టీ ఇన్ ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ అచ్చెన్న అరెస్టు రాజకీయ కక్ష సాధింపు చర్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు తెలంగాణా ప్రభుత్వం అమలు చేసిన విధంగా నిధులు ఖర్చు చేసినట్లు అచ్చెన్ననాయుడు ఇదివరకే స్పష్టం చేశారు. కేవలం పార్టీ పై బురద జల్లడానికే ఈ అరెస్టులు అని ఆయన దుయ్యబట్టారు. తెలుగు దేశం పార్టీ తాటాకు చప్పుళ్ళకు బెదరదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రావులపాలెం మండల పార్టీ అధ్యక్షులు గుత్తుల పట్టాభి రామారావు, కంఠంశెట్టి శ్రీనివాస్, పడాల బులికొండారెడ్డి, భాస్కరరెడ్డి, చిట్టి రెడ్డి యల్లమిల్లి జగన్మోహనరావు తదితర నేతలు పాల్గొన్నారు