మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం
మరో మంత్రికి కరోనా
ముంబై జూన్ 12
మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల్లో దేశంలోనే మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలిచింది. ఇప్పటికే ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, తాజాగా మరో మంత్రికి కరోనా సోకింది. మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి ధనుంజయ్ ముండే, ఆయన వ్యక్తిగత సహాయకుడితో పాటు కొంతమంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు గురువారం రాత్రి ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. బుధవారం మంత్రాలయలో జరిగిన కేబినెట్ సమావేశంలో ముండే పాల్గొన్నారు. దీంతో మంత్రివర్గంతో పాటు ఉన్నతాధికారుల్లో ఆందోళన మొదలైంది.కరోనా బారిన పడ్డ మూడో మంత్రి ధనుంజయ్ ముండే కాగా, అంతకుముందు గృహనిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవద్, పబ్లిక్ వర్క్స్ మంత్రి అశోక్ చవాన్కు కూడా కరోనా సోకింది. అయితే వీరిద్దరూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 97,648 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,590 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ముంబైలోనే నిన్న 97 మంది కరోనాతో చనిపోయారు.