YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కొనసాగుతున్న కరోనా కల్లోలం

కొనసాగుతున్న కరోనా కల్లోలం

కొనసాగుతున్న కరోనా కల్లోలం
న్యూఢిల్లీ, జూన్ 13,
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కేసుల్లో మరో కొత్త రికార్డు నమోదయ్యింది. దేశవ్యాప్తంగా  11,775 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. మరో 389 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటగా.. మరణాలు 8,886గా నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటడం గమనార్హం. ఇక, దేశంలోని మొత్తం కరోనా మరణాల్లో 42 శాతం మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి.ఇక, వరుసగా రెండో రోజూ 11వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పది రోజుల్లోనే లక్షకుపైగా కేసులు నమోదుకావడంతో ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,09,360కి చేరింది. జూన్ 2 నాటికి రెండు లక్షలుగా ఉన్న పాజిటివ్ కేసులు.. జూన్ 12కి మూడు లక్షలకు చేరడం గమనార్హం. అయితే, కేసుల పెరుగుదల రేటు ఈ సమయంలో 4.5 నుంచి 4 శాతానికి తగ్గింది.మహారాష్ట్రలో  మరో 3,493 కొత్త కేసులు నిర్ధారణ కాగా.. దేశ రాజధాని ఢిల్లీలో 2,137 కేసులు నిర్ధారణ అయ్యాయి. తొలిసారి ఢిల్లీలో పాజిటివ్ కేసులు 2వేల మార్క్ దాటింది. ఇక, శుక్రవారం 389 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. అత్యధికంగా ఢిల్లీలో 129 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర కంటే ఢిల్లీలో ఎక్కువ మంది చనిపోవడం ఇదే తొలిసారి. ఢిల్లీలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 36,824కి చేరింది. మహారాష్ట్ర (3,717), గుజరాత్ (1,416), ఢిల్లీ (1,214) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.హరియాణాలో కొత్తగా 366 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో అక్కడ కేసుల సంఖ్య 6వేలు దాటింది. దేశంలో ఆరువేలకుపైగా కేసులు నమోదయిన 11వ రాష్ట్రంగా హరియాణా నిలిచింది. అక్కడ కరోనా వైరస్ కేసులు తొలి 3వేలు దాటడానికి 93 రోజులు పడితే, కేవలం వారం రోజుల్లోనే 6వేలకు చేరింది. గుర్గావ్‌లోనే 2,922 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది.తమిళనాడులో కొత్తగా 1,982 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 40వేలకు చేరింది. చెన్నై నగరంలోనే దాదాపు 29వేల కేసులు నమోదయ్యాయి. దీంతో హాస్పిటల్స్‌లో స్వల్ప లక్షణాలున్న కరోనా రోగులు, తక్కువ ముప్పు ఉన్నవారిని వెయిట్‌లిస్ట్‌లో ఉంచాలని నిర్ణయించారు. తమిళనాడులో కేసుల డబ్లింగ్ రేటు 14 రోజులుగా ఉంటే, చెన్నైలో 13 రోజులుగా ఉంది. ప్రస్తుతం తమిళనాడులో 18,281 యాక్టివ్ కేసులు ఉండగా.. చెన్నైలో 13,906 మంది హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా నుంచి ఇప్పటి వరకూ 154,234 మంది కోలుకున్నారు.

Related Posts