YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

 ఉగ్రవాదులను ఏరిపారేస్తున్నారు...

 ఉగ్రవాదులను ఏరిపారేస్తున్నారు...

 ఉగ్రవాదులను ఏరిపారేస్తున్నారు...
శ్రీనగర్, జూన్ 13,
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా అనంత్‌నాగ్, కుల్గామ్ జిల్లాలో మరో నలుగురు ముష్కరులను సైన్యం కాల్చి చంపింది. శనివారం తెల్లవారుజామున మొదలైన ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. అనంత్‌నాగ్ జిల్లా లల్లన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో భద్రత దళాలు అక్కడకు చేరుకున్నాయి. సీఆర్పీఎఫ్, ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా అక్కడకు చేరుకుని, నిర్బంధ తనిఖీలు చేపట్టగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం.. మరికొందరు ఉంటారని భావిస్తోంది.కుల్గామ్ జిల్లా నిపోరా ప్రాంతంలోనూ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో సైన్యం అక్కడకు చేరుకుని, నిర్బంధ తనిఖీలు చేపట్టింది. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా... మరికొందరు ఉంటారని అనుమానిస్తున్నారు.అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్‌లో హతమైన ఇద్దర్నీ హిజ్బుల్ ముజాయిద్దీన్‌కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు. ఘటనా స్థలంలో రెండు తుపాకులు, మూడు గ్రనేడ్లు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.ఉగ్రవాద సంస్థల అగ్రనేతలే టార్గెట్‌గా రంగంలోకి దిగిన సైన్యం.. భారీగా విజయం సాధించింది. సైన్యంవైపు ఎలాంటి నష్టం జరగకుండా తెలివిగా ముష్కరులను మట్టుబెడుతోంది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే 11 వేర్వేరు ఆపరేషన్లు చేపట్టి 30మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టారు. జూన్ నెలలో వారం వ్యవధిలోనే 18 మంది తీవ్రవాదులు ఎన్‌కౌంటర్‌లో హతమవ్వడం సైన్యం పట్టుదలకు అద్దం పడుతోంది.‌

Related Posts