YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఆధారాలు వున్నాయి..ఆరెస్టు చేసాం

ఆధారాలు వున్నాయి..ఆరెస్టు చేసాం

ఆధారాలు వున్నాయి..ఆరెస్టు చేసాం
విజయవాడ జూన్ 13 
ఈ ఏస్ ఐ స్కాంకు సంబంధించి ఇప్పటి వరకు  రెండు  ఎఫ్ఐఆర్ లు  నమోదు చేసాం. ఈ కేసులో ఇప్పటి వరకు డైరెక్టర్లు విజయ్ కుమార్, రమేష్ కుమార్, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు జేడీ జనార్దన్, ఉద్యోగులు చక్రవర్తి, వెంకట్రావు, రమేష్ బాబు అరెస్ట్ అయ్యారు. ఈఎస్ఐ నిధుల కేటాయింపులో 2018-19కి సంబంధించి 988 కోట్లలో 150 కోట్లు అవినీతి గుర్తించామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవి కుమార్ అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. ల్యాబ్ కిట్ల కొనుగోలు, సర్జికల్, ఆఫీస్ ఫర్నిచర్, ఈసీజీ కొనుగోలు లో అక్రమాలు జరిగినట్టు గుర్తించాం. ఈ కేసులో ఇప్పటి వరకు19 మంది ముద్దాయిలను గుర్తించాం. మరింత మందిని విచారణ చేయబోతున్నాం. డాక్యుమెంట్స్ పరిశీలన చేయాల్సి ఉంది. అచ్చెన్నాయుడు కి  వైద్యం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. డాక్టర్ల బృందం అచ్చెన్నాయుడు కి వైద్యం చేసిందని అయన అన్నారు. టెలీ హెల్త్ లో ఈసీజీ కి 200 రూపాయలు బదులు 480 వసూలు చేశారు. కాల్ సెంటర్ సర్వీసులు వాడుకున్న వారికి 1.80 బదులు ఎక్కువగా వసూలు చేశారు. అచ్చెన్నాయుడు, రమేష్ కుమార్ తరపున హౌస్ మోషన్ పిటిషన్లు వేశారు. వేరే రాజకీయ నాయకుల పాత్ర ఇంత వరకు గుర్తించలేదు. ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఎక్కువగా ఉన్నట్టు గుర్తించాం. అవసరం లేకపోయినా, నాణ్యత లేని పరికరాలు మందులు కొన్నారని గుర్తించాం. అచ్చెన్నాయుడు లెటర్ హెడ్ ద్వారా  అర్దర్లు ఇవ్వాలని ఆదేశించారు. కొనుగోళ్ళకు సంబంధించి ఒకటి, టెలీ మెడిసిన్ కి సంబంధించి విడి విడిగా రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసాం. ఈ రెండు కేసుల్లో ఏ1గా రమేష్ కుమార్, ఏ2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే అచ్చెన్నాయుడ్ని విచారణకు రావాలని కోరలేదు. ఆధారాలు సేకరించాం, అవకతవకలు చేసినట్టు గుర్తించాం కాబట్టే అరెస్ట్ చేసామని అయన వివరించారు.

Related Posts