లోయలోపడ్డ జీపు.. ముగ్గురు మృతి
న్యూఢిల్లీ జూన్ 13
హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. మండి జిల్లా కమంద్ ఏరియాలో జీపు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో జీపులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు. మితిమీరిన వేగంవల్లే మూల మలుపు వద్ద జీపు లోయలో పడి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.