వైకాపా నేతలపై కేసులు వుండవా
అమరావతి జూన్ 13
టిడిపి నాయకుడు చింతమనేని ప్రభాకర్ అరెస్టుని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. కోవిడ్ నిబంధనలు ఒక్క టిడిపి నాయకులకేనాని అయన ప్రశ్నించారు. చింతమనేని ఎక్కడా గుంపులుగా తిరగలేదు. వెంట అనుచరులు లేరు. ఒంటరిగా వెళుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసారు. ఆఖరికి కరోనా ని కూడా వేధింపుల కోసం వాడుకుంటున్నారు గుంపులుగా తిరిగి, ర్యాలీలు నిర్వహించి, కరోనా వ్యాప్తి కి కారణమైన వైకాపా నేతల పై కేసులు ఉండవా అని అయన ప్రశ్నించారు.