తాడిపత్రిలో ఉద్రిక్తత
అనంతపురం జూన్ 13
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్రెడ్డి అరెస్ట్తో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్ట్లకు నిరసనగా టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి అరెస్ట్ దారుణం అంటూ యాడికి మండల కేంద్రంలో టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే తాడిపత్రిలోని జేసీ నివాసానికి టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఉదయమే భారీగా చేరుకున్నారు.