YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 నాకు సమాచారం ఇచ్చారు స్పీకర్ తమ్మినేని

 నాకు సమాచారం ఇచ్చారు స్పీకర్ తమ్మినేని

 నాకు సమాచారం ఇచ్చారు
స్పీకర్ తమ్మినేని
అమరావతి జూన్ 13 
ఎమ్మెల్యే అచ్చేన్నాయుడును అదుపులోకి తీసుకునే ముందు  నాకు సమాచారం ఇచ్చారు. ఎందుకు అరెస్టు చేస్తున్నాము,ఏ ఏ సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నామో ముందుగానే ఎసిబి డిజి,జైళ్ల శాఖ,సిఐయుయు నా దృష్టికి తీసుకొచ్చారని స్పీకర్ తమ్మినేని సీతారాం వివరించారు.  అచ్చెన్నాయుడు విషయంలో నిబంధనలు ప్రకారమే అధికారులు వ్యవహరించారు. చంద్రబాబు అచ్చెన్నాయుడు విషయంలో చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. నేరాలకు బిసిలకు సంబంధం ఏంటి ?  అచ్చెన్నాయుడు బిసి అయితే చేసిన నేరానికి వదిలేద్దామా ? నేరస్థూలకు కులం అపాదించి ఆయా వర్గాలను అవమానిస్తున్నారు. అచ్చెన్నాయుడు నేరం చెయ్యకపోతే నేరం ఎవరు చేశారో చంద్రబాబు చెప్పాలి.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈఎస్ఐ లో కుంభకోణం జరిగింది. ఇన్వెస్ట్గెటివ్ ఏజెన్సీలు ఏపీలో  ప్రజాప్రతినిధుల విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తోందని అయన అన్నారు.
ఎసిబి అధికారుల ఫండమెంటల్ డ్యూటీని  చంద్రబాబు రాజకీయాల కోసం తప్పుదారి పట్టిస్తున్నారు. చేసిన నేరాలను అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు బిసిల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. అచ్చెన్నాయుడు ఎవరో ఏంటో మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే గా ఉన్న  నెరస్థుడిని పట్టుకొని స్వాతంత్ర్య సమర యోధుడుగా చిత్రీకరిస్తున్నారు. అచ్చెన్నాయుడు నేరం విషయంలో గాంధీ,పూలే,అంబెడ్కర్ విగ్రహాల దగ్గర నిరసనలు చేసి ప్రజలకు  ఏమి సంకేతం ఇస్తున్నారు. అచ్చెన్నాయుడు విషయంలో టీడీపీ చేస్తున్న ఆందోళనలు ఎస్సి, ఎస్టీ, బీసీలను అవమానించేలా ఉన్నాయి. అచ్చెన్నాయుడు నేరంలో లోతుగా విచారణ చేస్తే మని లాండరింగ్ చట్టంలో 3,4 సెక్షన్లు    వర్తిస్తాయి. ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టి ఎవరి ఖాతాల్లో వేశారనే విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. టెక్కలి చెందిన గ్రానైట్ వ్యాపారులు పాత్ర ఉందని సమాచారం అందుతుంది. ఎమ్మెల్యేగా  ఉన్న  అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో వాస్తవాలు తెలియాలని స్పీకర్ గా మీ ముందుకు వచ్చాను. అచ్చెన్నాయుడు విషయంలో  బిసిలు అనే ముందు స్కామ్ లో భాధితులగా ఉన్నది ఎవరో టీడీపీ నేతలు  ముందు చెప్పాలి.  బిసి పేరుతో ఎస్సి, ఎస్టీ, బిసిలకు చేరాల్సినవి బిసి పేరు చెప్పి దోచేస్తారా ?. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి దృష్ట్యా చంద్రబాబు అనుమతించడం లేదు. కరోన వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని గవర్నర్ ప్రసంగానికి ఆన్లైన్ ద్వారా ఏర్పాట్లు చేస్తూన్నాం. సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యేలకు సభకు  హాజరు కావాలని ఆహ్వానాలు పంపుతున్నాం. 175 మంది ఎమ్మెల్యేల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అయన అన్నారు. 225 సీటింగ్ కెపాసిటీ ఉంది భౌతిక దూరం పాటించేలా సభకు ఏర్పాట్లు చేస్తున్నామని అయన అన్నారు.
 

Related Posts