YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాంగ్రెస్, టీడీపీపై ఎర్రబెల్లి విమర్శలు

కాంగ్రెస్, టీడీపీపై ఎర్రబెల్లి విమర్శలు

కాంగ్రెస్, టీడీపీపై ఎర్రబెల్లి విమర్శలు
హైద్రాబాద్, జూన్ 13,
రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. జలదీక్షల పేరుతో కాంగ్రెస్‌, బీజేపీలు దొంగనాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. గతంలో వారు పూర్తిచేసిన ప్రాజెక్టు ఒక్కటీ లేదని విమర్శించారు. అలాంటి వాళ్లు జలదీక్షల పేరుతో ధర్నాలు చేస్తుంటే తనకు సిగ్గనిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఇంతే చేస్తూ పోతే వాళ్లని ప్రజలు ఉరికిచ్చి కొట్టే రోజులు వస్తాయని ఎద్దేవా చేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారుకాంగ్రెస్, బీజేపీ నేతలు మూర్ఖంగా మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. గతంలో అసలు వీళ్లు ఏం మంచి పనులు చేశారని ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నారని ప్రశ్నించారు. వృద్దులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్నామని, ఇందుకు ప్రభుత్వం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తోందని గుర్తు చేశారు. కేవలం రూ.200 కోట్లు ఇచ్చి మొత్తం ఆ పథకమే మాది అని అంటున్న బీజేపీని ఏమనాలని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఇప్పటికే ప్రజలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను విస్మరించారని విమర్శించారు.
 

Related Posts