YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 ముంబైలో కరోనా విలయతాండవం

 ముంబైలో కరోనా విలయతాండవం

 ముంబైలో కరోనా విలయతాండవం
ముంబై, జూన్ 13,
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. అత్యధికంగా మహారాష్ట్రలోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో మొత్తం మూడు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా.. ఒక్క మహారాష్ట్రలో ఆ సంఖ్య లక్ష దాటింది. గడచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 3,493 కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 1,01,141కు చేరింది. ఇప్పటి వరకు 3,717 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ కేసుల్లో చైనా, కెనడాల కంటే మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది.మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 96 రోజుల్లోనే లక్ష దాటింది. తొలిసారి మార్చి 9న దుబాయ్ నుంచి వచ్చిన పుణేకు చెందిన జంటకు వైరస్ నిర్ధారణ కాగా.. తర్వాత 77 రోజులకు 50వేల మార్క్ దాటింది. కేవలం 19 రోజుల్లోనే మరో 50వేలు కేసులు నమోదయి లక్షకు చేరింది. జూన్ నెలలో 12 రోజుల్లోనే 30వేల మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది.ఇక, దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో పరిస్థితి రోజురోజుకీ దయనీయంగా మారుతోంది. మహారాష్ట్రలోని మొత్తం కేసుల్లో 50 శాతానికిపైగా ముంబయి నగరంలోనే ఉన్నాయి. ఇప్పటి వరకూ అక్కడ 55,451 మందికి వైరస్ నిర్దారణ అయ్యింది. థానేలో 16,443, పుణేలో 11,281 కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబయిలోనే 2వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని మొత్తం కరోనా మరణాల్లో 55 శాతం ముంబయి నగరంలోనే నమోదుకావడం గమనార్హం.కాగా, మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ప్రకటన ఉండబోదని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. కేసులు అంతకంతకూ పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఆంక్షల తొలగింపు అనివార్యమైందని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. అలాగే, లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కొన్ని రోజుల పాటు కేసులు పెరగడం సహజమని.. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడతాయని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇక, కేసుల సంఖ్యలో మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో బాధితుల సంఖ్య 40,698కి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 1,982 కేసులు నమోదయ్యాయి. వీరిలో 22,000 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. 367 మంది ప్రాణాలు కోల్పోయారు.

Related Posts