YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 ఒంటరి మహిళలే టార్గెట్

 ఒంటరి మహిళలే టార్గెట్

 ఒంటరి మహిళలే టార్గెట్
విశాఖపట్టణం, జూన్  13
వితంతువులు, భర్తలను వదిలేసి ఒంటరిగా ఉంటున్న మహిళలపై వలేసి వారి నుంచి అందినకాడికి దోచుకుంటున్న కేటుగాడి వ్యవహారం విశాఖలో వెలుగులోకి వచ్చింది. చిట్టిమాము గ్యాంగ్‌తో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తూ ఈ నెల 6వ తేదీన వైజాగ్ పోలీసులకు చిక్కిన జవహర్‌ బాలకృష్ణన్‌ అలియాస్‌ బాలాకుమార్‌ మోసాల గురించి తెలుసుకుని పోలీసులే విస్తుపోయారు. విచారణలో అతడు సుమారు 30 మంది మహిళలను మోసగించినట్లు వెల్లడైంది. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన చిలకూరి జవహర్‌ బాలకృష్ణన్‌ సులువుగా డబ్బులు సంపాదించేందుకు ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు. విడాకులు తీసుకుని, బాగా డబ్బులు ఉండి రెండో పెళ్లి కోసం ఎదురుచూసే మహిళలు, భర్త చనిపోయి మరో పెళ్లి కోసం ఎదురు చూసే డబ్బున్న మహిళలనే టార్గెట్‌ చేసేవాడు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్, వాట్సాప్‌ల సాయంతో పరిచయం పెంచుకుని తన ఫొటోలు, ఇతర వివరాలు పంపించి నమ్మకం పెంచుకునేవాడు. అనంతరం వారిని పెళ్లి చేసుకుని కొద్దిరోజుల పాటు అన్యోన్యంగా ఉంటూ తర్వాత డబ్బు, నగలతో పరారయ్యేవాడు.మరికొందరిని పెళ్లి చేసుకోకుండానే సహజీవనం పేరుతో శారీరకంగా వాడుకుని సీక్రెట్‌గా ఫోటోలు, వీడియోలు తీసేశాడు. వాటితో మహిళలను బెదిరించి డబ్బులు గుంజేవాడు. ఈ విధంగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 30 మంది మహిళలను మోసం చేశాడు. వీరిలో 17 మంది పోలీసులను ఆశ్రయించడంతో కేసులు నమోదు చేశారు. మరోవైపు పలువురు వ్యాపారవేత్తలకు ప్రాంచైజీలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకుని మోసం చేయడంతో అనేక రాష్ట్రాల్లో 25 వరకు కేసులు నమోదయ్యాయి. వైజాగ్‌లోనే అతడిపై మూడు కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.ఛీటింగ్ కేసులో జవహర్‌ బాలకృష్ణన్‌ను కొద్ది నెలల క్రితం వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరిలోవలోని సెంట్రల్ జైలుకు తరలించిన సమయంలో అక్కడే రౌడీషీటర్‌ చిట్టిమాముతో బాలకృష్ణన్‌కు పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. ఇంతలో కరోనా మహమ్మారి కారణంగా అధికారులు ఖైదీలను జైలు నుంచి విడుదల చేశారు. అప్పుడే బయటకు వచ్చిన అతడు చిట్టిమాము గ్యాంగ్‌లో చేరి నగరంలో అనేక సెటిల్‌ మెంట్లు చేశాడు. చిట్టిమాము తన పుట్టిన రోజు వేడుకను ఈ నెల 5న కూర్మనపాలెం ప్రాంతంలోని అక్షిత గ్రాండ్‌ హోటల్‌లో నిర్వహించాడు.ఈ విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్కడ దాడి చేయగా 30 మంది చిక్కారు. వారందరిపైనా లాక్‌డౌన్‌ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. అయితే చిట్టిమాముతో పాటు మరో ఐదుగురు చాకచక్యంగా అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో వారి కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టి ఆరో తేదీ తెల్లవారుజామున కారులో వెళ్తున్న చిట్టిమాము, జవహర్ బాలకృష్ణన్‌ , ఆనంద్, మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. కారులో నుంచి20 కిలోల గంజాయి, రూ.లక్షన్నర నగదు, 24 బీరు బాటిళ్లు, మూడు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని స్టేషన్లో ప్రశ్నిస్తుండగా జవహర్‌ బాలకృష్ణన్‌ అంతర్రాష్ట్ర నేరగాడని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో అతడి నేరాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతంతో నగరంలోని రౌడీషీటర్ల కార్యకలాపాలపై నిఘా పెంచినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీబీ త్రినాథ్ తెలిపారు

Related Posts