YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రాజెక్టుల పేరుతో దోపిడి

ప్రాజెక్టుల పేరుతో దోపిడి

ప్రాజెక్టుల పేరుతో దోపిడి
మాజీ మంత్రి డీకే అరుణ
హైదరాబాద్ జూన్ 14
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పై బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణమండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రంలో పాలనా జరగడం లేదు. ప్రాజెక్ట్ ల పేరుతో తెలంగాణను దోచుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో లక్ష కోట్ల వ్యయం పెంచారని ఆమె ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలకు నీరందించారు ప్రభుత్వం లెక్క చెప్పాలి. అభివృద్ది పేరుతో కమీషన్ ల కోసం 3లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలపై భారం మోపారు. ప్రజల సంక్షేమం కోసం టీఆర్ ఎస్  ప్రభుత్వం పని చేయడం లేదు. ప్రాజెక్ట్ ల కమీషన్ల కోసమే పరితపిస్తుంది. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తాం... ప్రజల్లోకి వాస్తవాలు తీసుకెళ్తాం.  మాటల గారడితో ప్రజలను మోసం చేస్తున్న టీఆర్ ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆమె అన్నారు.

Related Posts