YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

 చైనాలో భారీగా కేసులు నమోదు

 చైనాలో భారీగా కేసులు నమోదు

 చైనాలో భారీగా కేసులు నమోదు
బీజింగ్, జూన్ 15,
చైనాలో కొత్తగా 57 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ దేశాల్లో మరింత కలవరం మొదలైంది. కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తిలోనూ తన ప్రతాపం చూపే ప్రమాదం ఉందని పలు దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 75 లక్షలు దాటిన వేళ.. ఈ వార్త మరింత కలవరానికి గురిచేస్తోంది. చైనాలో ఏప్రిల్ తర్వాత ఒక్కరోజులో ఇవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. చైనా రాజధాని బీజింగ్‌లోని ఓ మాంసం, కూరగాయల మార్కెట్ తాజాగా వైరస్ వ్యాప్తికి కారణమైనట్లు అధికారులు గుర్తించారు.కొత్తగా నమోదైన కేసుల్లో 36 కేసులు బీజింగ్ నగరంలో స్థానికంగా నమోదైనట్లు చైనా అధికారులు తెలిపారు. మరో రెండు కేసులు లియానింగ్ ప్రావిన్స్‌లో నమోదైనట్లు వెల్లడించారు. అయితే.. బీజింగ్‌లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి వీరిద్దరూ క్లోజ్ కాంటాక్టులుగా గుర్తించినట్లు తెలిపారు. కాగా.. మరో 19 కేసుల్లో బాధితులు విదేశాల నుంచి వచ్చిన వారని చైనా అధికారులు వెల్లడించారు.సుమారు రెండున్నర నెలల పాటు లాక్‌డౌన్ విధించి కరోనా వైరస్‌ను కట్టడి చేసిన చైనా ప్రభుత్వాన్ని కొత్త కేసులు కలవర పెడుతున్నాయి. కొత్తగా వైరస్ వ్యాప్తి చెందిన మార్కెట్ సరిసరాల్లో 11 నివాస సముదాయాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. బీజింగ్‌లో రెండు నెలల తర్వాత కొత్తగా మళ్లీ కేసులు నమోదవడంతో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు.కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కొత్తగా కేసులు నమోదవుతుండటాన్ని చైనా ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పాజిటివ్ కేసులు నమోదైన మార్కెట్ పరిసరాల్లో వందలాది మంది పోలీసులను, హెల్త్ వర్కర్లను రంగంలోకి దింపింది. ఆ మార్కెట్‌‌తో లింకులున్న ఇతర కూరగాయల మార్కెట్లను కూడా మూసేసి పారిశుధ్య చర్యలు చేపట్టారు. మార్కెట్ సమీపంలోని 9 పాఠశాలలతో పాటు మైదానాలను, జిమ్‌లను, హోటళ్లను మూసివేశారు

Related Posts