ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమావేశమయ్యారు. సమావేశంలో సింగరేణిపై కేసీఆర్ సమీక్షించారు. ఈ భేటీకి సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు కుడా హజరయ్యారు. సింగరేణి ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై పాటు కారుణ్య నియామకాలు, సింగరేణి సమస్యలపై ఎమ్మెల్యేలతో చర్చించారు. కొత్త కోల్ మైనింగులు, ఉద్యోగ కల్పన అంశాలతో పాటు సింగరేణి ప్రాంతంలో ఇటీవల కాంగ్రెస్ బస్సు యాత్రకు ఆదరణ పై కుడా చర్చించారు. ఈ సందర్బంగా అయన కోల్ బెల్ట్ ఏరియా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసారు. కొందరు ఎమ్మెల్యేలకు తమ పనితీరు మార్చుకోవాలని చురకలంటించిన సీఎం లేదంటే వేటు తప్పదంటూ హెచ్చరించారు.