వైకాపా తీర్థం పుచ్చుకున్న నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు
నెల్లూరు జూన్15
నెల్లూరు గ్రామీణ నియోజవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో, ఆంధ్ర ప్రదేశ్ దేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు ఆదివారం వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వెనుకబడిన తరగతుల వర్గాలకు చెందిన పట్టు సాలె సంఘం జిల్లా అధ్యక్షులు పాలెపు సుఖ దేవయ్య ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పరిపాలనలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమానికి శ్రీకారం చుట్టడం సంతోషకర విషయం అన్నారు. ఇందులో భాగంగానే నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు జిల్లా వెనుకబడిన తరగతుల వారిని గుర్తించి వైకాపాలో చేర్చుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు వినుకొండ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ కుటుంబీకులు మరియు బిసి సంఘ నాయకులు, కార్యకర్తలు పార్టీ కండువా కప్పుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బీసీ సంఘాల అభ్యున్నతికి తన వంతు చేయూత అందిస్తాం అని చెప్పడం హర్షణీయమన్నారు. పార్టీలో చేర్చుకోవడ మే కాకుండా, నూతనంగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత కల్పించే అవకాశం కల్పిస్తానని భరోసా ఇవ్వడం ఆనందకరమైన విషయం అన్నారు. ఈ అవకాశం కల్పించిన పార్టీ శాసనసభ్యులు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక సేవా సంఘం కార్యదర్శి వింజమూరు మస్తాన్ బాబు తదితరులు పాల్గొన్నారు.