YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీహార్ లో రోడ్డు ప్రమాదం

బీహార్ లో రోడ్డు ప్రమాదం

బీహార్ లో రోడ్డు ప్రమాదం
పాట్నా, జూన్ 15, 
రెండు ఆటోలపై ఎదురుగా వస్తున్న లారీ దూసుకెళ్లి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన బీహార్ రాష్ట్రంలోని గయ వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బీహార్‌లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గయ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. అమస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిష్ణుగంజ్ గ్రామం వద్ద రెండు ఆటోలపై ట్రక్కు దూసుకెళ్లడంతో అందులోని ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. అతివేగంతో ఎదురుగా వచ్చిన ట్రక్ ఆటోలపైకి దూసుకెళ్లింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తొలుత క్షతగాత్రులకు మదన్‌పూర్ హాస్పిటల్‌‌లో ప్రథమ చికిత్స చేసి, జిల్లా ఆస్పత్రికి తరలించామని సీనియర్ ఎస్పీ రాజీవ్ మిశ్రా తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వెల్లడించారు. అలాగే, మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం గయలోని అనుగ్రహ నారాయణ్ మగధ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించినట్టు వివరించారు. మృతులు అమస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెగానియా గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. వీరంతా బలుగంజ్‌లోని తమ బంధువుల ఇంటిలో జరిగిన ఓ వేడుకకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదానికి గురైన ఆటోలు గయ నుంచి ఔరంగాబాద్‌ వైపు వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది.

Related Posts