YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దాడి చేసిన వారిపై తక్షణమే కేసు నమోదు చేయాలి

దాడి చేసిన వారిపై తక్షణమే కేసు నమోదు చేయాలి

 దాడి చేసిన వారిపై తక్షణమే కేసు నమోదు చేయాలి
మద్దికేర జూన్ 15 
విలేకరిపై దాడి చేసిన వైసీపీ నాయకుడి పై తక్షణమే కేసు నమోదు చేయాలని మద్దికెర మండల ఏపిజేఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.పత్తికొండ పట్టణంలో వార్త  విలేఖరి అయిన రాముడు పై జరిగిన దాడి కు నిరసనగా మద్దికేర తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ వెంకటలక్ష్మి కు వినతి పత్రం అందజేశారు.విలేకరిపై దాడి చేసిన అధికార పార్టీ వైసిపి నాయకులు బాబుల్ రెడ్డి మరియు అతని అనుచరులపై వెంటనే కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.పాత్రికేయులపై ఇలాంటి దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పాత్రికేయులు డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు సుల్తాన్,వీర శేఖర్,వెంకటేశ్వర్లు,రాంబాబు, విజయుడు, రమేష్,శివ చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts