YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పోరుమామిళ్లలో లోకేష్

పోరుమామిళ్లలో లోకేష్

 పోరుమామిళ్లలో లోకేష్
కడప జూన్ 15
వైసీపీ కార్యకర్తల ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయని, అవమానాలకు తట్టుకోలేక పోతున్నామని మీరు స్పందించకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ నేతలు సీతా వెంకటసుబ్బయ్య,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రంతు, వెంకటేశ్వర్లు, బాలాజి, మురళిమోహన్,ఇమామ్ హుస్సేన్, సుబ్బారావు లు విన్నవించుకున్నారు.కడపజిల్లా పొరుమామిల్ల లో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. పోరుమామిళ్ల లో పార్టీ నాయకులు కార్యకర్తలతో కొద్దిసేపు మాట్లాడారు. తాడిపత్రి నుంచి వయా మైదుకూరు పోరుమామిళ్ల మీదుగా విజయవాడ పోతూ మార్గమధ్యలో పోరుమామిళ్ల పార్టీ నాయకులు కార్యకర్తలతో కొద్దిసేపుమాట్లాడారుతెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు రక్షణ గా ఉంటుందన్నారు.ఏ సమస్యలు వచ్చినా నేరుగా ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే మీ ముందు ఉంటామన్నారు. తదనంతరం విజయవాడ బయల్దేరి వెళ్లారు.ఈయన వెంట కమలాపురం పుట్టా నరసింహరెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి,కార్యాకర్తలు పాల్గొన్నారు.

Related Posts