‘‘అజ్ఞానం అహంకారం మరింత ప్రమాదకరమైంది: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ జూన్ 15
మోదీ నేతృత్వంలోని సర్కార్పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిరంతరాయంగా విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. అందులో భాగంగా ఆయన సోమవారం ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు.‘‘అజ్ఞానం కంటే అహంకారం మరింత ప్రమాదకరమైంది. దీనిని లాక్డౌన్ రుజువు చేసింది’’ అంటూ సర్కార్పై మండిపడ్డారు. దీంతో పాటు ఆయన ఆర్థిక పరిస్థితి, మరణాల రేటు చూపిస్తూ ఓ గ్రాఫ్ను కూడా పోస్ట్ చేశారు. ఆర్థిక వ్యవస్థ తనం, లాక్డౌన్ కాలంలో మరణాల పెరుగుదలను ఈ గ్రాఫ్ చూపిస్తోంది. లాక్డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిపోయిందని కేంద్రంపై రాహుల్ మండిపడ్డారు.