లోకేష్ అనంత పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం
అనంతపురం జూన్ 15
ఎమ్మెల్సీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురంలోని జేసీ నివాసానికి వెళ్లారు. అక్కడ లోకేష్కు జేసీ పవన్ రెడ్డి, జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం జేసీ నివాసంలో పవన్ రెడ్డితో లోకేష్ భేటీ అయ్యారు. ప్రభాకర్ రెడ్డి, అస్మితరెడ్డిల అరెస్టు... కేసు వివరాలను పవన్ రెడ్డి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వివరించారు. మరోవైపు లోకేష్ పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గుత్తి మండలం, కొత్తపేటలో టీడీపీ కార్యర్తలను, వాహనాలను అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు రోడ్డుకు అడ్డంగా పెట్టి నిరసనకు దిగారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో తాడిపత్రిలో జేసీ కుటుంబాన్ని లోకేష్ పరామర్శించేందుకు వెళ్లారు.