YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇవ్వని హామీలను కూడా అమలు చేశాం

ఇవ్వని హామీలను కూడా అమలు చేశాం

ఇవ్వని హామీలను కూడా అమలు చేశాం
- గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
అమరావతి జూన్ 16,
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం రాజ్భవన్ నుంచి ఆన్లైన్ ప్రసంగం చేసారు. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా భౌతిక దూరం పాటించాల్సి ఉండటంతో ఈ నిర్ణ యం తీసుకున్నారు. బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ వచ్చి ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవా యితీ. దేశంలోనే తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ మాట్లాడుతూ  మేనిఫెస్టోలో లేని 40 హామీలను అమలు చేశాం. జల, ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాం. విద్యుత్, రవాణా, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నాం.అణగారిన వర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు.  ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.  ఏడాదిలో రూ.42 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు లో వున్నాయి.  18 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చాం. రాష్ట్రంలో సేవారంగంలో 9.1శాతం వృద్ధి. పారిశ్రామిక రంగంలో 5 శాతం వృద్ధి నమోదయింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 శాతం వృద్ధి వుంది. 122 హామీల్లో 77 హామీలు నెరవేర్చాం..39 హామీలు పరిశీలనలో ఉన్నాయి.  మన బడి పథకంలో 15700 స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన కల్పించాం.  దశల వారీగా మూడేళ్లలో 45 వేల పాఠశాలల అభివృద్ధి చేసాం.  వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 6.20 లక్షల మందికి సేవలు అందాయి.  హైదరాబాద్, చెన్నై, బెంగూళూరులోనూ ఆరోగ్యశ్రీ సేవలు లభిస్తున్నాయి.  వైఎస్ఆర్ కంటి వెలుగుతో 67 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు చేసాం.  విజయవంతంగా వైఎస్ఆర్ టెలీ మెడిసిన్ నడుస్తోంది.   నాడు- నేడు పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రులను జాతీయ స్థాయిలో అభివృద్ధి వుంది. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు 13,500 సాయంఅందుతోంది. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తున్నాం. కరువు పరిస్థితుల నుంచి బయటపడేందుకు రూ. 2వేల కోట్ల విపత్తు సాయం అందించాం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం.  ఎక్కడా లేని విధంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.  వైఎస్ఆర్ పెన్షన్ కింద 50 లక్షల మందికి లబ్ధి..ఇంటి వద్దే పెన్షన్ అందిస్తున్నాం.  సంక్షేమ పథకాల ద్వారా 3.92 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని అన్నారు.సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.900 కోట్ల సాయం,  గ్రామీణ ఉత్పత్తులు విక్రయించేందుకు త్వరలో వైఎస్ఆర్ జనతా బజార్లు,   ఇళ్ల పట్టాలు, సంక్షేమ పథకాలు మహిళల పేరుతో ఇవ్వడం ద్వారా మహిళా అభ్యున్నతికి చర్యలు చేపడుతున్నామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కోన్నారు.
 ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ క్లినిక్లు, బలహీనవర్గాల అభ్యున్నతికి 50 శాతం నామినేటెడ్ పోస్టులు, పనులు,  అత్యాచారాల నిరోధానికి దిశ చట్టం ,  పట్టణాల్లో రక్షిత మంచినీటికి ప్రాధాన్యత,  2021 డిసెంబర్లోగా పోలవరం పూర్తి ,  వచ్చే నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్ట్లు పూర్తి చేస్తామని అయన అన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.2200 కోట్లు ఆదా చేశాం.  రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో ఓడరేవుల ర్మాణం, పోర్టుల నిర్మాణానికి మూడేళ్లలో రూ.3200 కోట్లు కేటాయించాం. పెట్టుబడులను ఆహ్వానించేందుకు త్వరలో కొత్త పారిశ్రామిక విధానం రూపోందించబోతున్నాం. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం.. రోజుకు 15 వేల టెస్ట్లు చేసాం. ఇప్పటికే 5.5 లక్షల టెస్ట్లు చేశాం . జాతీయ సగటు కంటే ఏపీలో రికవరీ రేటు అధికం వుంది. 38 వేల ఐసోలేషన్ బెడ్స్ సిద్ధం.. 1300 వెంటిలేటర్లు ఉన్నాయి. 24 వేల మంది వైద్యులు..24500 మంది పారామెడికల్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. గ్రామ వాలంటీర్లు, పోలీసులు సమర్ధవంతంగా పనిచేశారు . 3.2 లక్షల మంది వలస కార్మికుల ప్రయాణ ఖర్చులు భరించామని గవర్నర్ పేర్కోన్నారు. 

Related Posts