YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నల్లచొక్కాలతో తెదేపా నేతల నిరసన

నల్లచొక్కాలతో తెదేపా నేతల నిరసన

నల్లచొక్కాలతో తెదేపా నేతల నిరసన
అమరావతి జూన్ 16,
మంగళవారం ప్రారంభమయిన ఏపీ అసెంబ్లీ సమావేశాలకు తెదేపా అధినేత చంద్రబాబుతో సహా పార్టీనేతలంతా నల్లచొక్కాలు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అంతకుముందు వారందరూ వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.  ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... సొంత అజెండాను అమలు చేసుకునేందుకే అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులకే పరిమితం చేశారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు కనీసం 15రోజుల పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుని అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సభలో మాట్లాడే అవకాశం వచ్చినా రాకపోయినా సమస్యల పరిష్కారం కోసం తమవంతుపోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.  మరో ఎమ్మెల్యే చిన రాజప్ప మాట్లాడుతూ... తెదేపా ప్రజాప్రతినిధుల నోరు నొక్కేందుకే కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు.పెళ్లికి హాజరైన యనమల రామకృష్ణుడు, తనపై అన్యాయంగా కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
 

Related Posts