YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా అందోళన

అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా అందోళన

అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా అందోళన
శ్రీకాకుళం జూన్ 16
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం, నిమ్మాడ ప్రాంతంలో రైతులు ఆందోళన బాట పట్టారు.అచ్చెన్నాయుడు, కుటుంబ సభ్యుల ఆస్తులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చెయ్యాల డిమాండ్ చేశారు.రైతుల ఆందోళన కు వైసీపీ నేతలు మద్దతు ప్రకటించారు.నిమ్మాడ గ్రామానికి చెందిన పట్ట యరకయ్య, మెండ. రామమూర్తి కి చెందిన ఆస్తి ని అక్రమంగా ఎల్ అండ్ టీ సంస్థకు  లీజికి ఇచ్చి, ఆ ఆస్తిని అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు దోచుకున్నారని ఆరోపించారు. ఈఎస్ఐ కుంభకోణం లో 150కోట్లు అవినీతి, టెండర్ లేకుండా నామినేషన్ క్రింద ఆర్డర్ లు ఇచ్చి కోట్లాది రూపాయలు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైం ది. 293.5కోట్లు విలువైన మందులు కొనుగోలు కు కేటాయింపు చేయగా పరిమితికి మించి రేటు కాంట్రాక్టు లేని సంస్థలు నుండి ఏంకంగా 698.36 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేశారు.ఈ క్రమంలో టెక్కలి లో 2014-19 వరకు జరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాల మంజూరు లో జరిగిన అవినీతి పై పూర్తి స్థాయిలో విజిలెన్స్ ఎంక్విరీ చెయ్యాలని వైసీపీ నేతలు కోరారు. అచ్చెన్నాయుడు,అతని కుటుంబ సభ్యులు పై జ్యుడీషియల్ దర్యాప్తు జరపాలని నిమ్మాడ గ్రామంలో పర్యటించిన వైసీపీ నేత పేరాడ తిలక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిమ్మాడ గ్రామంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు.

Related Posts