YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 మరదలిపై మోజు..భార్య హత్య

 మరదలిపై మోజు..భార్య హత్య

 మరదలిపై మోజు..భార్య హత్య
కర్నూలు, జూన్ 16,
అక్కతో కాపురం చేస్తూ ఆమె చెల్లెలితో పెళ్లికి సిద్ధమయ్యాడో ప్రబుద్ధుడు. రెండో పెళ్లికి భార్య నిరాకరించడంతో దారుణానికి పాల్పడ్డాడు. మరదలిపై మోజుతో కట్టుకున్న భార్యని కిరాతకంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. బేతంచెర్ల మండలం గోరుమానుకొండ తండాకు చెందిన సుశీలాబాయి(26)కి అలేబాదుతండాకి చెందిన రవి నాయక్‌తో వివాహమైంది. వారికి ఒక పాప సంతానం.కొద్దికాలంగా భార్య చెల్లెలిని రెండో పెళ్లి చేసుకుంటానంటూ చెప్తున్నాడు. అందుకు భార్య ఒప్పుకోకపోవడంతో కోపం పెంచుకున్నాడు. భార్యను అడ్డుతొలగిస్తే మరదలిని పెళ్లి చేసుకోవచ్చన్న ఉద్దేశంతో ఆమెని నమ్మకంగా తీసుకెళ్లి హతమార్చాడు. గొర్రెలు మేపేందుకు కొండకి వెళ్తున్నానంటూ భార్యని వెంట తీసుకెళ్లి బండరాయితో తలపై మోది కిరాతకంగా చంపేశాడు. ఆమె శవాన్ని లోయలో పడేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి హైడ్రామాకు తెరతీశాడు.న భార్య కనిపించడం లేదంటూ కొత్త నాటకం మొదలుపెట్టాడు. అదే విషయాన్ని అత్తమామలకు ఫోన్ చేసి చెప్పడంతో వారు రాత్రికి రాత్రే గ్రామానికి చేరుకుని వెతకడం ప్రారంభించారు. మరుసటి రోజు ఉదయం లోయలో మహిళ మృతదేహాన్ని గమనించిన పశువుల కాపరులు గ్రామస్తులకు విషయం తెలియజేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.భార్య మృతదేహం బయటపడడంతో రవినాయక్ అక్కడి నుంచి పరారయ్యాడు. రెండో పెళ్లి కోసం తన కూతురిని అల్లుడే దారుణంగా హత్య చేశాడని అక్కని చంపేశాడంటూ హతురాలి తండ్రి సేవ్యా నాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Related Posts