అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్
అమరావతి జూన్ 17,
బుధవారం రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ మొదలు కాగానే ప్రతిపక్ష తెలుదేశం పార్టీ వాకౌట్ చేసింది. తమ పార్టీ నేతల అక్రమ అరెస్టులు, బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడే అవకాశం కల్పించడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. రెండో రోజు సభ ప్రారంభంలో సంతాప తీర్మానాలను ప్రవేశ పెట్టారు. అనంతరం ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పలు కేటాయింపుల గురించి సభలో చదివి వినిపించారు. ఏయే శాఖకు ఎన్ని నిధులు కావాలి?.. ఎంత కేటాయించారు అనేదానిపై బుగ్గన సభకు వివరించారు.