YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

సంతోష్ కు నివాళులు

సంతోష్ కు నివాళులు

సంతోష్ కు నివాళులు
ఖమ్మం జూన్ 17 
కల్నల్ సంతోష్ బాబు త్యాగం మరువలేనిదని, దేశం కోసం సంతోష్ చేసిన ప్రాణ త్యాగానికి యావత్ భారతావని సెల్యూట్ చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జడ్పీ హాల్లో సర్వసభ్య సమావేశంకు ముందు జెడ్పి హాల్లో కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదన్నారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దేశం కోసం సంతోష్ చేసిన ప్రాణ త్యాగానికి యావత్ భారతావని సెల్యూట్  చెబుతుందన్నారు. నివాళులు అర్పించిన వారిలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, జెడ్పిటిసిలు,యంపీపీలు,అధికారులు పాల్గొన్నారు.

Related Posts