ఎంపీ రేవంత్ కేసు…
పోలీసులకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ జూన్ 17
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై పోలీసులకు తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. మాదాపూర్ ఏసీపీ శ్యామ్ ప్రసాద్ రావు, నార్సింగి ఇన్స్పెక్టర్ గంగాధర్కు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని వారిని హైకోర్టు ఆదేశించింది. గతంలో జాన్వాడలోని కేటీఆర్ కు చెందిన ఫామ్ హౌజ్ లో డ్రోన్లు వినియోగించానన్న ఆరోపణలపై తనను అరెస్టు చేయడంలో పోలీసులు సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ రేవంత్ రెడ్డి ఏసీపీ, ఇన్స్పెక్టర్ పై రేవంత్ రెడ్డి ఇటీవల హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 5న తనను అరెస్టు చేసే ముందు నోటీసులు కుడా ఇవ్వలేదన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసీ, నోటీసులు జారీ చేయకుండా ఉద్దేశపూర్వకంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని రేవంత్ ఆరోపణ. వారిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని న పిటిషన్లో కోరారు.