సీఎం కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి
అమరావతి జూన్ 17
అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో సీఎం వైయస్.జగన్మెహన్ రెడ్డిని జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరి శంకరరావు, అంబటి రాంబాబు కలిసారు. పల్నాటి ప్రజల తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే వరికపూడిశెల ప్రాజెక్టుకు ఈ యేడు బడ్జెట్ లో నిధులు కేటాయించడం పై హర్షం వ్యక్తం చేస్తూ, సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. 70 యేళ్లుగా పల్నాటి ప్రజలకు కలగా ఉన్న వరికపూడిశెల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని త్వరగా పూర్తిచేసేందుకు వై.యస్.ఆర్ పల్నాడు దుర్భిక్ష నిర్మూలన మిషన్ లో విలీనం చేయడంపై హర్షం వ్యక్తం చేసారు