YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం విదేశీయం

 చైనా పై చర్యలు ఎప్పుడు

 చైనా పై చర్యలు ఎప్పుడు

 చైనా పై చర్యలు ఎప్పుడు
న్యూఢిల్లీ, జూన్ 17,
గత నెలన్నర రోజులుగా భారత్, చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. వివాదాస్పద ప్రాంతం నుంచి వెనక్కు వెళ్లినట్టే వెళ్లిన చైనా సైన్యాలు సోమవారం రాత్రి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో చైనా వైఖరిపై అంతర్జాతీయంగా మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా సంక్షోభం కారణంగా సరిహద్దుల్లో ఘర్షణలను త్వజించి ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారిస్తారని అందరూ భావించిన తరుణంలో చైనా అనూహ్యంగా దాడులకు పాల్పడి పొరుగువారిని రెచ్చగొడుతోందని అమెరికా మాజీ దౌత్యవేత్త డేనియల్ రస్సెల్ వ్యాఖ్యానించారు.‘ఘర్షణలను వీడి, ఇంటిని చక్కదిద్దడంపై దృష్టిపెట్టాలని అనుకుంటున్న సమయంలో పొరుగు దేశాలు దాడిచేసి రెచ్చగొడుతోంది. దీనికి బదులుగా, జీ జిన్‌పింగ్ జాతీయవాదాన్ని ఉసిగొల్పుతున్నారు..ఈ చర్యల పరిణామాలను చైనా లెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది’ అని ఆసియా సొసైటీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ వైస్-ప్రెసిడెంట్ డేనియల్ రస్సెల్ అన్నారు.ఇక, 1976 నాటి సాంస్కృతిక విప్లవం తర్వాత చైనా జీడీపీ రికార్డుస్థాయిలో పడిపోయిందని, 2020 తొలి త్రైమాసికంలో 6.8 శాతం మేర తగ్గిపోయిందన్నారు. ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను నిలిపివేసిన కరోనావైరస్ మహమ్మారిపై పోరాడటానికి దేశం అపూర్వమైన చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. కోవిడ్-19 ప్రభావంతో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో చైనా జీడీపీ 20.65 ట్రిలియన్ల యూన్ (2.91 ట్రిలియన్ డాలర్లు)‌గా నమోదయ్యిందని, ఇది గతేడాదితో పోల్చితే 6.8 శాతం తక్కువ.ఒబామా హాయంలో ఆసియా వ్యవహారాలను పర్యవేక్షించిన రస్సెల్.. విదేశాంగ శాఖ తూర్పు ఆసియా, పసిఫిక్ వ్యవహారాల సహాయ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు, అధ్యక్షుడికి ప్రత్యేక సహాయకుడిగా.. శ్వేతసౌథం, జాతీయ భద్రతా మండలి సీనియర్ డైరెక్టర్‌గానూ వ్యవహరించారు.ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ సైతం సరిహద్దుల్లో భారత్, చైనా ఘర్షణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలూ సంయమనంతో వ్యవహరించాలని ఆయన తరఫున అధికార ప్రతినిధి విజ్ఞ‌ప్తి చేశారు. విల్సన్ సెంటర్ నిపుణులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘భారత-చైనా సంబంధాలు ఇండో-పసిఫిక్ భౌగోళిక రాజకీయ మార్పులకు కారణమవుతాయి.. 50 ఏళ్లలో చైనా-భారత్ సరిహద్దులో ఘర్షణను ఇప్పటికే చూశాం.. రెండు దేశాలు జాతీయవాదాన్ని ఎత్తుకున్నాయి.. కోవిడ్-19, ఇతర దీర్ఘకాల సమస్యలు ఫలితంగా ఇరు దేశాలు దేశీయ, అంతర్జాతీయ తిరుగుబాట్లను ఎదుర్కొంటున్నాయి’అని వ్యాఖ్యానించారు.

Related Posts