హవల్దార్ పళనికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
రామనాధపురం జూన్ 18,
భారత చైనా సరిహద్దులో సోమవారం జరిగిన ఘర్షణలో మృతిచెందిన హవల్దార్ పళనికి అయన సొంతగ్రామం కడుక్కలూరులో అంత్యక్రియలు జరిగాయి.గురువారం ఉదయం అయనకు సైనిక లాంఛనాలలో భాగంగా గన్ సెల్యూట్ ఇచ్చారు. సైనిక అధికారులు, జిల్లా కలెక్టర్, పోలీసులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో స్థానికులు హజరై పళనికి తుది వీడ్కోలు పలికారు. తమిళనాడు ప్రభుత్వం పళని కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అయన కుటుంబానికి చెక్కును అందించారు.