YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఖమ్మంలో మూడు గ్రామాల్లోనే ఓడీఎఫ్

ఖమ్మంలో మూడు గ్రామాల్లోనే ఓడీఎఫ్

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. జిల్లాలోని 23 మండలాల్లో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద మొత్తం 81,172 వేల మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో 19,006 మరుగుదొడ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. అయితే స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద మంజూరైన మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేల చొప్పున మంజూరు చేసింది. పెరిగిన ధరల నేపథ్యంలో ఆ మొత్తం సరిపోవడంలేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. సిమెంట్, ఇటుకలు, మేస్త్రీ కూలీ ధరలు విపరీతంగా పెరిగాయని, దీంతో ప్రభుత్వం ఇస్తున్న రూ.12వేల సరిపోవడం లేదని చెబుతుఆన్నరు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని మరుగుదొడ్లు నిధుల వ్యయాన్ని పెంచాలని కోరుతున్నారు. వివిధ దశల్లో 49వేల682 మరుగుదొడ్లు ఉన్నాయి. ఇంకా 12వేల484 మరుగుదొడ్ల నిర్మాణపనులు ప్రారంభించలేదు. మార్చి 31 నాటికి మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా లక్ష్యాన్ని సాధించలేకపోయారు. లబ్ధిదారులకు పూర్తిస్ధాయిలో అవగాహన కల్పించకపోవడంతో నిర్దేశితి గడువులో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  జిల్లావ్యాప్తంగా మూడు గ్రామాలనే ఓడీఎఫ్‌గా మార్చారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌కింద మొత్తం81,172  వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో  19,006 మరుగుదొడ్లు మార్చి నాటికి పూర్తయ్యాయి. మార్చి 31నాటికి పూర్తికాని మరుగుదొడ్లను జూన్‌నాటికి పూర్తి చేయాలి. లక్ష్యసాధనకోసం చర్యలు తీసుకుంటున్నాం. మరుగుదొడ్ల నిర్మాణంలో అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. లబ్దిదారులు నిర్మాణంలో తీవ్రజాప్యం చేయడంతో జిల్లాలో మూడు గ్రామపంచాయతీలు మాత్రమే ఓడీఎఫ్‌గా ప్రకటించాం. ఏప్రిల్‌ నెలాఖరుకు వంద గ్రామాలను ఓడీఎఫ్‌గా మార్చుతాం.  

Related Posts