YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

ఐరాసలో భారత్ ఎంపిక

ఐరాసలో భారత్ ఎంపిక

ఐరాసలో భారత్ ఎంపిక
జెనివా జూన్18 
కరోనా వైరస్ ప్రభావంతో భారత్ విలవిల్లాడుతున్న సమయంలో భారత్ ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైంది. 2021 జనవరి నుంచి 2022 చివరి వరకు భారత్ ఈ హోదాలో కొనసాగుతుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ ఎన్నికైంది. బుధవారం ఐదు తాత్కాలిక సభ్య దేశాల కోసం ఎన్నికలు నిర్వహించగా.. పోలైన 192 ఓట్లలో భారత్కు అనుకూలంగా 184 ఓట్లు పడ్డాయి. మన దేశంతోపాటు ఐర్లాండ్, మెక్సికో, నార్వే దేశాలు కూడా భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికయ్యాయి. భారత్ రెండేళ్లపాటు తాత్కాలిక సభ్య దేశంగా ఉండనుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి భారత్కు తాత్కాలిక సభ్య దేశం హోదా లభిస్తుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్య దేశాలు, పది తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. ప్రతి రెండేళ్లకోసారి చొప్పున తాత్కాలిక సభ్య దేశాలు మారుతుంటాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా శాశ్వత సభ్య దేశాలు. వీటికి మాత్రమే వీటో అధికారం ఉంటుంది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అమెరికా, జపాన్ సహా పలు దేశాలు భారత్కు శాశ్వత సభ్యత్వం పట్ల సుముఖంగా ఉన్నాయి. గతంలో భారత్ 1950-1951, 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92, 2011-12 సంవత్సరాల్లో భారత్ భద్రతా మండలిలో సభ్యదేశంగా ఎన్నికైంది. ఈస్తోనియా, నైగర్, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడినెస్, ట్యునీషియా, వియత్నాం దేశాలు ఇప్పటికే తాత్కాలిక సభ్య దేశాలుగా ఉన్నాయి. బెల్జియం, డొమినికన్ రిపబ్లిక్, జర్మనీ, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా దేశాల తాత్కాలిక సభ్యత్వం ఈ ఏడాది చివరితో ముగియనుంది.

Related Posts