YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

త్వరలో  పోకో  కొత్త స్మార్ట్ ఫోన్ 

త్వరలో  పోకో  కొత్త స్మార్ట్ ఫోన్ 

త్వరలో  పోకో  కొత్త స్మార్ట్ ఫోన్ 
ముంబాయి జూన్18
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ సబ్ బ్రాండ్ అయిన పోకో మనదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రానున్న 20-25 రోజుల్లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానున్నట్లు సమాచారం. పోకో ఎం2 ప్రోనే ఈ స్మార్ట్ ఫోన్ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ ఇప్పటికే బ్లూటూత్ ఎస్ఐజీ, వైఫై అలయన్స్ సైట్లలో కనిపించింది. ఇప్పుడు ఈ ఫోన్ బీఐఎస్(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ కూడా పొందింది. దీంతో పోకో ఎం2 ప్రో మనదేశంలో లాంచ్ కానుందనే వాదనలు బలపడ్డాయి.పోకో ఎం2 ప్రో బీఐఎస్ వెబ్ సైట్ లో కనిపించిందని ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ తెలిపారు. ఇదే మోడల్ నంబర్ బ్లూటూత్ ఎస్ఐజీ, వైఫై అలయన్స్ సైట్లలో కూడా కనిపించింది. ఈ బీఐఎస్ సైట్ దీని గురించిన కీలక సమాచారాన్ని వెల్లడించలేదు. ఈ ఫోన్ షియోమీ ఇండియా ఆర్ఎఫ్ ఎక్స్ పోజర్ పేజ్ లో రెడ్ మీ నోట్ 9, ఎంఐ 10లతో పాటు కనిపించింది. గతంలో వచ్చిన లీకుల ప్రకారం పోకో ఎం2 ప్రో స్మార్ట్ ఫోన్ గ్రామ్ అనే పేరుతో కనిపించింది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్ ను ఇందులో అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సర్టిఫికేషన్ల ప్రకారం ఈ ఫోన్ బ్లూటూత్ వీ5, డ్యూయల్ బ్యాండ్ వైఫైలను కూడా సపోర్ట్ చేయనుంది.పోకో ఇండియా జనరల్ మేనేజర్ సి.మన్మోహన్ కూడా తాజా ఇంటర్వ్యూలో కొత్త పోకో ఫోన్ 20 నుంచి 25 రోజుల్లో లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఎటువంటి టీజర్లనూ పోకో విడుదల చేయలేదు. పోకో ఎం2 ప్రో కాకుండా పోకో ఎఫ్2 ప్రో కూడా మనదేశంలో లాంచ్ కానుందని ఎప్పట్నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పోకో ఎఫ్2 ప్రో యూరోప్ లో 499 యూరోల(సుమారు రూ.41,500) ధరతో లాంచ్ అయింది.

Related Posts