YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

పెళ్లి కాలేదని ఆత్మహత్య

పెళ్లి కాలేదని ఆత్మహత్య

పెళ్లి కాలేదని ఆత్మహత్య
అనంతపురం జూన్18
పాతికేళ్లు వస్తున్నా పెళ్లి చేయడం లేదని యువకుడు మనస్థాపానికి గురయ్యాడు. అదే బాధతో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రలకు కడుపుకోత మిగిల్చాడు. చిన్నచిన్న విషయాలకే మనస్థాపానికి గురై యువత ఆత్మహత్యలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగం రాలేదని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. కుటుంబ సభ్యులు తనకు పెళ్లి చేయడం లేదని మనస్థాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తాజాగా అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రామగిరి మండలం పేరూరు గ్రామానికి చెందిన నారాయణ, ప్రసాదమ్మ దంపతులకు ఏకైక కొడుకు వెంకటేశు(24). తనకు పెళ్లి చేయడం లేదని మనస్థాపానికి గురైన వెంకటేశు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పెళ్లి చేయలేదన్న బాధతో గ్రామానికి సమీపంలోని పొలాల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి కోసం ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.చెట్టంత ఎదిగిన కొడుకు చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మణానికి పాల్పడ్డాడని తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చెట్టుకు వేలాడుతున్న వెంకటేశును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts