YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కొనసాగుతున్న ఉద్రిక్తత

కొనసాగుతున్న ఉద్రిక్తత

కొనసాగుతున్న ఉద్రిక్తత
న్యూఢిల్లీ జూన్18 
భారత్, చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి వివాదాస్పద ప్రాంతాల్లో ముఖ్యంగా తూర్పు లడఖ్ లోని గాల్వన్ లోయ, దేమ్ చుక్, దౌలత్ బేగ్ ఓల్డీలలో ఇరు దేశాలకు చెందిన సైన్యం మధ్య ఘర్షణ కొనసాగుతోంది. తూర్పు లడఖ్ లోని గాల్వన్ లోయ తమదేనంటూ చైనా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. జూన్ 6న జరిగిన లెఫ్టినెంట్ జనరల్ స్థాయి సైనిక అధికారుల మధ్య జరిగిన చర్చల సందర్భంగా వచ్చిన అవగాహనకు విరుద్ధంగా పొరుగుదేశం అతిశయోక్తులు, ఆమోదయోగ్యం కాని ప్రకటనలు చేస్తోందని మండిపడింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ 6న భారత్, చైనా సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల సందర్భంగా కుదిరిన ఒప్పందాన్ని శ్రీవాస్తవ్ ప్రస్తావించారు. భారత్, చైనా సైనికుల మధ్య గాల్వన్ లోయ వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘర్షణల్లో కల్నల్ సహా 20 మంది ఇండియన్ ఆర్మీకి చెందిన సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ వెంబడి 1967 భారత్, చైనా యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద హింసాత్మక ఘటన ఇదే కావడం గమనార్హం. నాటి యుద్ధంలో చైనాను భారత్ చావుదెబ్బ కొట్టింది. చైనావైపు 300 మంది సైనికులు చనిపోగా.. భారత్వైపు 80 మంది జవాన్లు వీరమరణం పొందారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో గురువారం ఉదయం ఫోన్లో మాట్లాడిన భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్.. జూన్ 6న చర్చల సందర్భంగా కుదిరిన అవగాహనకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. లడఖ్ లో ప్రస్తుత పరిణామాలపై చైనా విదేశాంగ మంత్రితో జయశంకర్ మాట్లాడినట్టు శ్రీవాస్తవ్ తెలిపారు. ‘మొత్తం పరిస్థితిని బాధ్యతాయుతంగా నిర్వహించి, జూన్ 6 న సీనియర్ కమాండర్స్థాయి అధికారుల మధ్య కుదిరిన అవగాహనను హృదయపూర్వకంగా అమలు చేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. అతిశయోక్తి, ఆమోదయోగ్యం కాని వాదనలు చేయడం ఈ అవగాహనకు విరుద్ధం’ అని అన్నారు. గాల్వన్ లోయ వద్ద చోటుచేసుకున్న సంఘటన ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని, ప్రత్యక్షంగా చైనా సైన్యం హింసకు కారణమైందని విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జరిగిన ఫోన్ సంభాషణలో జైశంకర్ స్పష్టం చేశారు.

Related Posts