YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం విదేశీయం

రక్షణ చర్యలు తీసుకోవాల్సిందే..

రక్షణ చర్యలు తీసుకోవాల్సిందే..

రక్షణ చర్యలు తీసుకోవాల్సిందే..
న్యూఢిల్లీ, జూన్ 19,
తూర్పు లడఖ్‌లోని ఇరు దేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న ప్రాంతాల్లో దుస్సాహసానికి పాల్పడుతున్న చైనాకు పరిమిత సైనిక చర్య ద్వారా బుద్ధిచెప్పే అంశాన్ని భారత్ ఎంపికచేసుకోవాలని..కానీ, దీనికి రాజకీయపరమైన అనుమతి తప్పనిసరి అని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. రాజకీయ, దౌత్యపరమైన, ఆర్థిక, సైనిక చర్యల ద్వారా 1999లో పాకిస్థాన్‌‌కు కార్గిల్‌లో గుణపాఠం చెప్పిన మాదిరిగా ప్రస్తుతం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) సైనికులను భారతదేశం భూభాగంగా భావించే ప్రాంతాల నుంచి వెళ్లగొట్టవచ్చని, అప్పుడే సరిహద్దుల్లో సంఘర్షణకు తెరపడుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.అయితే, సైనిక అసమానతలు, ఆర్ధికంగా మన కంటే ముందు వరుసులో ఉండటంతో చైనా పాకిస్థాన్ కాదనే వాస్తవం గ్రహించాలి అని పేర్కొన్నాయి. పూర్తిస్థాయి యుద్ధం లేదా సంఘర్షణ గురించి మాట్లాడటం లేదు, అయితే భారత్ సైనికపరంగా బలహీనం కాదని నిస్సందేహంగా చెప్పాల్సిన అవసరం ఉంది.. సరిహద్దుల్లో ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చడం, మన భూభాగాలను ఆక్రమించుకోవడం కుదరదు అని వ్యాఖ్యానించాయి.గాల్వన్ లోయ వద్ద దొంగదెబ్బ తీసిన అత్యంత క్రూరంగా చైనా 20 మంది భారత సైనికులను పొట్టనబెట్టుకుంది. లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 3,488 కిలోమీటర్ల సరిహద్దు వెంబడి అనేక ప్రాంతాలపై వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు సిక్కిం, అరుణాచల్‌ భూభాగాలను ఆక్రమించుకోడానికి చైనా ప్రయత్నాలు ముమ్మరం చేసింది... అయితే, భౌగోళిక, రాజకీయ, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని పరిమిత సైనిక చర్యపై రాజకీయ నాయకత్వం తుది నిర్ణయం తీసుకోవాలని విశ్వసనీయ వర్గాలు కోరుతున్నాయి.గాల్వన్ లోయ ఘర్షణ తర్వాత ఉత్తర సరిహద్దుల్లో సైన్యం అప్రమత్తమయ్యింది. దాదాపు యుద్ధ సన్నద్ధతతో ఉన్న సైన్యం.. ముఖ్యంగా గాల్వన్ లోయ, దౌలత్ బేగ్ ఓల్డీ, దెప్సాంగ్, చుషుల్ వద్ద చైనా పీపుల్స్ ఆర్మీ కదలికలపై డేగ కళ్లతో నిఘావేసింది. ఎల్‌ఏసీ వెంట చైనా సైన్యం చర్యలను ట్రాక్ చేయడానికి క్రమం తప్పకుండా ఉపగ్రహాలు, డ్రోన్లు, రాడార్లు, ఎలక్ట్రో-ఆప్టిక్ సెన్సార్‌లతో కూడి పీ-8ఐ వంటి సుదూర నౌక విమానాల వంటి నిఘా వ్యవస్థను మోహరిస్తోంది. టిబెట్‌లోని గార్గున్సా, హోటాన్, కష్గర్, గోంగర్, కోర్లా వంటి చైనా ఎయిర్‌బేస్‌లను కూడా నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.

Related Posts