వైకాపా నేతల అందోళన
రాజమండ్రి జూన్ 19
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైకాపా నేతలు అందోళనకు దిగారు. గోదావరి బండ్ పద్మావతి ఘాట్ వద్ద పర్యాటక జలవిహార నియంత్రణ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిరసనకు దిగారు. రాజమహేంద్రవరం ఎంపీ భరత్ విషయంలో కనీసం ప్రోటోకాల్ పాటించి లేదంటూ నినాదాలు చేసారు. ప్రజాప్రతినిధుల అందరి ఫోటోలు వేసి కావాలని మా ఎంపీ గారి ఫోటో వెయ్య లేదంటూ వాగ్వాదానికి దిగారు. ప్రోటోకాల్ ఉల్లంఘనకు అధికారులను మున్సిపల్ కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు.