YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ నుండి బీజేపీలోకి వలసలు

వైసీపీ నుండి బీజేపీలోకి వలసలు

వైసీపీ నుండి బీజేపీలోకి వలసలు
తుగ్గలి  జూన్ 19
అధికార వైసిపి పార్టీ నుండి బీజేపీలోకి  వలసలు ప్రారంభమయ్యాయి. తుగ్గలి మండల పరిధిలోని మారేళ్ల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు బీజేపీలోకి చేరి,బిజెపి కండువ ను కప్పుకున్నారు.మారేళ్ల గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్,బీజేపీ నాయకులు ఆర్.కౌలుట్ల యాదవ్ నాయకత్వంలో,పత్తికొండ ఇంచార్జ్ రంగ గౌడ్ అద్వర్యంలో ప్రముఖ హై కోర్ట్ న్యాయవాది బీజేపీ రాష్ట్ర నాయకులు పురుషోత్తం రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.శుక్రవారం ఎమ్మిగనూరులోని విశాల గార్డెన్ లో పురుషోత్తం రెడ్డి సమక్షంలో పుండుకురి సంజన్న,పుండుకురి రామాంజనేయులు,నల్ల గోవింద్,టపాల చిన్న వెంకటేష్ లు పార్టీ లో చేరారు.ముఖ్యంగా ముందు నుంచి వీరు వైసీపీలో పుండుకురి కుటుంబాలు కష్టపడుతూ వచ్చారు.అంతే కాకుండా వైసీపీ అంటే కూడా ఎంతో అభిమానము వారిలో ఉండేది.అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వారు పార్టీని వీడి బీజేపీలోకి చేరారు.దీంతో బీజేపీ పార్టీ మారేళ్ల గ్రామంలో బలపడేందుకు వారు అందరూ కృషి చేస్తూ,వచ్చే ఎంపీటీసీ ఎన్నికలో బీజేపీ సత్తా ఏమిటో చూపించేందుకు సిద్ధం అయ్యారు. ముఖ్యంగా మరి కొంత మంది గ్రామ స్థాయి నేతలు కూడా బీజేపీలోకి చేరేందుకు సిద్ధం అవుతున్నారు.అదేవిధంగా బీజేపీలో చేరిన నల్ల గోవింద్ తెలుగు దేశం పార్టీకి చెందిన ప్రముఖ నేత దేవరేంటి వెంకట రాముడికి స్వయాన అల్లుడు,అదే విధంగా తెలుగు దేశం పార్టీలో చురుకైన నేతగా పేరొందిన ఆర్.యం.పి డాక్టర్ మదయ్య సోదరుడు చిన్న వెంకటేష్ కూడా బీజేపీలోకి చేరారు.ఈ కార్యక్రమంలో పత్తికొండ ఇంచార్జ్ రంగా గౌడ్,నాయకులు ఆర్.కౌలుట్ల యాదవ్,మండల కార్యదర్శి నరేష్ కుమార్ యాదవ్,బీజేవైయం మండల అధ్యక్షుడు ఆర్.కె.కరుణాకర్ యాదవ్,బిజెపి గ్రామ నాయకులు సేదభాయి,లక్ష్మన్ లు పాల్గొన్నారు.

Related Posts