YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టిడిపి నేతలపై వైకాపా నేతలు రౌడీయిజం తగదు

టిడిపి నేతలపై వైకాపా నేతలు రౌడీయిజం తగదు

టిడిపి నేతలపై వైకాపా నేతలు రౌడీయిజం తగదు
నెల్లూరు  జూన్ 19
 రాష్ట్రంలో టిడిపి నేతలపై వైకాపా నేతల రౌడీయిజం, దౌర్జన్య కాండ ఎక్కువైందని నెల్లూరు టిడిపి నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి , నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ఎస్కే అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. స్థానిక ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి నేతలపై వైకాపా నేతలు రౌడీయిజం దౌర్జన్యకాండకు దిగుతున్న పరిస్థితులు, రాష్ట్ర ప్రజలకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయని తన ఆవేదన వ్యక్తపరిచారు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లాకు చెందిన రాష్ట్ర శాఖ మంత్రి  పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు అయిన నారా లోకేష్ ను అసభ్య పదజాలంతో పెట్టడమే కాకుండా. ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ ప్యాంటు జిప్పు వైపు చూపిస్తూ హైలెట్ హేళనగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరు ఏమీ చేయలేరు అన్నట్టుగా టిడిపి నాయకులను, వైకాపా నాయకులు అవహేళన మాట్లాడడం సబబు కాదన్నారు. అదేవిధంగా టిడిపి జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర పై దాడికి పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా వైకాపా నేతలు మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ, టిడిపి నేతల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నేతలు జెమిని రమణయ్య, మొయినుద్దీన్ సాబీర్ ఖాన్ , మౌలానా అజీజ్, మున్నా, ఆశిక్, జహీర్, పాషా మొహిదీన్ , జాఫర్ తదితరులు పాల్గొన్నారు

Related Posts