ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
ఎమ్మిగనూరు జూన్ 19,
ఎమ్మిగనూరు కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మిల్టరి కాలనీలోని అనాధ పిల్లలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మీనారాయణ రెడ్డి ,డీసీసీ ప్రధాన కార్యదర్శి కసిం వలి మాట్లాడుతూ భారతదేశ సరిహద్దుల్లో అసువులు బాసిన అమర జవాన్లకు నివాళి అర్పిస్తూ రెండు నిమిషాల పాటు శ్రద్ధాంజలి ఘటించి అమర జవాన్ల కుటుంబాలకు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. భారతదేశ రక్షణకు మన సైన్యం దేశ రక్షణ కొరకై వారి ప్రాణత్యాగం చేసి పని చేస్తున్నారో ఈ పరిశుద్ధ కార్మికులు కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వారి ప్రాణాలను లెక్క చేయక అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి వారి వంతెన ఎంతో శ్రమ చేస్తున్నారు అందుకే వారిని గుర్తించి వారిని గౌరవించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షుడు విరేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాయప్ప,చాంద్ బాషా, అసిఫ్, తదితరులు పాల్గొన్నారు,