సీఎం జగన్ ను సన్మానించిన ఉపముఖ్యమంత్రి అంజత్ భాషా
అమరావతి జూన్ 19
ప్రపంచ దేశాల్లో బిన్నత్వం లో ఏకత్వానికి మారు పేరు ఆయిన మన భారత దేశంలో, కేంద్ర ప్రభుత్వం వారిచే చేపడుతున్న నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ పై దేశంలోని మైనారిటీ వర్గాలైన ప్రత్యేకించి ముస్లిం ప్రజానీకం తీవ్ర అబధ్రతా భావానికి లోనై ఉన్నారు. జనాభాలో 9% శాతం ముస్లిం మైనారిటీలు కల్గిన మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, ముస్లిం ప్రజానీకంలో నెలకొన్న అబధ్రతా భావాన్ని తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఎన్పీఆర్ 2020 ప్రక్రియను నిలుపుదల చేసేందుకు, ఎన్నార్సీ ప్రక్రియను వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టడానికి అన్ని విధాలుగా సహకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజత్ బాషా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ని అందించి ముస్లిం ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలిపారు.