జనసేనా కార్యక్రమాలే లేవు...
విజయవాడ, జూన్ 20
జనసేన పార్టీలో కార్యక్రమాలు లేవు.. తాను పాల్గొనే పరిస్థితి లేదంటున్నారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. గెలిచి ఏడాది అవుతోంది.. ఎవరూ తనను పట్టించుకున్న పరిస్థితి లేదని.. 'పవన్ కళ్యాణ్ పక్కన ఎప్పుడైనా నన్ను చూశారా' అంటూ ప్రశ్నించారు. ఎప్పుడూ తనను పక్కన పెట్టుకునే పరిస్థితి లేదని.. తానూ బాధపడే పరిస్థితి లేదన్నారు. జనసేన పార్టీ బీఫారమ్ ఇచ్చింది.. ఆ పార్టీ సింబల్పై గెలిచాను అన్నారు. పార్టీని ఎప్పుడూ విమర్శించలేదని.. జనసేన ఎమ్మెల్యేగానే ఉన్నాను అంటున్నారు. తన కార్యక్రమాలను తాను చేసుకుంటున్నానని.. అధికార పార్టీకి అనుకూలంగా వెళితే కొన్ని నిధులు వచ్చే అవకాశం ఉంటుంది అన్నారు. అది కూడా ప్రజలకు మేలు జరుగుతుందనేని చెప్పుకొచ్చారు.రాజ్యసభ ఎన్నికల్లో తనకు నచ్చిన వారికి ఓటేశానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చెప్పారు. తాను జనసేన ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని, తనను కావాలనే దూరం పెడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ ఉందని.. తన ఓటు అవసరం ఎవరికీ లేదన్నారు. తనను ఓటు వేయమని ఎవరూ అడగలేదని.. పార్టీ నుంచి ఎలాంటి విప్ జారీ కాలేదన్నారు. పలానా వ్యక్తికి ఓటేయమని చెప్పలేదని.. తనకు నచ్చిన వ్యక్తికి ఓటు వేశాను అన్నారు. ఇదిలా ఉంటే రాపాక వైఎస్సార్2సీపీ అభ్యర్థికి ఓటు వేసినట్లు తెలుస్తోంది.